పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురంలో నూతనంగా నిర్మిస్తున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సోమవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతులకు మంచి మంచి కౌలు లభించి, ఉపాధి లభిస్తుందని వారు తెలిపారు.