కనిగిరి: పామూరు మండలంలో భూ సమస్యలను పరిష్కరించాలి: జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి రహీముల్లా
పామూరు మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వాసుదేవరావును జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి షేక్ రహీముల్లా జనసేన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రహీముల్లా మాట్లాడుతూ.... పామూరు మండలంలో రైతులకు సంబంధించిన భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను కోరారు. అదేవిధంగా భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.