రాప్తాడు: కురుగుంట గ్రామం వద్ద కస్తూరిబా జూనియర్ కళాశాల అదనపు భవనాలను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కురుగుంట గ్రామం వద్ద ఆదివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన జూనియర్ కళాశాల అదనపు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కురుగుంట కస్తూరిబా జూనియర్ కళాశాల నందు ఒక కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గజనులను ప్రారంభించడం జరిగిందని రానున్న రోజుల్లో ఈ జూనియర్ కళాశాల అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విద్యార్థినిలు అధ్యాపకులు గ్రామస్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.