కనిగిరి: మున్సిపాలిటీ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు, ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు
కనిగిరి మున్సిపాలిటీ వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలోని మసీదులు, ఈద్ గల వద్ద శనివారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తమ సందేశాన్ని ఇస్తూ... త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినం అన్నారు మహమ్మద్ ప్రవక్త సూచించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలన్నారు .సాటి మనిషి పట్ల ప్రేమ, దయాగుణం కలిగి ఉండి, పేదలకు తమకు ఉన్నదాంట్లో దానధర్మాలు చేసి వారికి అండగా నిలవాలని సూచించారు.