సంతనూతలపాడు: రాపర్ల గ్రామంలో రూ.2.54 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, BT రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో గురువారం రాత్రి సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 2.54 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, BT రోడ్డును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. వెనుకబడిన సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రాపర్ల గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు.