కనిగిరి: పట్టణంలోని జ్యోతిబాపూలే బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ ను ఆదివారం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పై విద్యార్థులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలకు వసతి గృహంలో మెరుగైన వసతులు మరియు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.