మూసాపేట: మూసాపేట మండల కేంద్రంలోని వేముల గ్రామంలో భారీ వర్షం ఈదురుగాలులకు మహిళ మృతి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని వేముల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. ఆ సమయంలో వడ్లకు కాపలా ఉన్న అల్లమాయపల్లి అయ్యమ్మ అనే మహిళ పక్కనే ఉన్న రేకుల డబ్బా దగ్గరికి వెళ్లింది. భారీ ఈదురు గాలులతో రేకుల డబ్బా ఆమెపై పడడంతో అక్కడి కక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.