జడ్చర్ల: క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి మంచి పద్ధతి కాదు:జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం జాగృతి కార్యకర్తలు చేసిన దాడి చేసిన ఘటనను జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో మునుపెన్నడు లేనటువంటి, ఇలాంటి ఘర్షణ రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ దాడుల సంస్కృతి తెలంగాణలో లేకుండే, ఇది మంచి పద్ధతి కాదని, న్యాయపరంగా ఎదుర్కోవాలని అన్నారు. ఇలాంటి దాడులు తెలంగాణ ప్రజలు హర్షించరని పేర్కొన్నారు