రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో జేఎన్టీయూ నూతన రిజిస్టర్ గా దుర్గాప్రసాద్ పదవి బాధ్యతలు తీసుకున్నారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జేఎన్టీయూ నూతన రిజిస్టర్ గా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ పదవి బాధ్యతలు తీసుకున్నాను. ఈ సందర్భంగా నూతన జేఎన్టీయూ రిజిస్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేయడం జరిగిందని ఈ సందర్భంలోనే రిజిస్టర్ గా తనకు అవకాశం రావడం జరిగింది అని భవిష్యత్తులో జేఎన్టీయూ యూనివర్సిటీ మరింత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని జెఎన్టియు నూతన రిజిస్టర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.