సంతనూతలపాడు: అమ్మనబ్రోలులో రేషన్ షాపు నుండి అక్రమంగా తరలిస్తున్న 125 బస్తాల రేషన్ బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్న గ్రామస్తులు
నాగులుప్పలపాడు: అక్రమంగా తరలిస్తున్న 125 బస్తాల రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు దాడి చేసి పట్టుకున్న సంఘటన నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు. అమ్మనబ్రోలు గ్రామంలోని ఓ రేషన్ దుకాణం నుండి 125 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా గ్రామస్తులు దాడి చేసి పట్టుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు తెలిపి, వారికి దాడి చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని అప్పగించారు.