ఉరవకొండ నియోజకవర్గ ఆరు మండలాల ముఖ్య నాయకులతో ఉరవకొండ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమాలపై అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గం లోని ప్రతి మండలంలో త్వరితగతిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి మండలం నుంచి సంతకాలను పూర్తి చేసి నియోజకవర్గం తరఫున మన వంతుగా ధ్రువపత్రాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆరు మండలాల ముఖ్య నాయకులకు ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.