అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి శివ దీక్ష మాలాధారస్వాములు శ్రీ మంజునాథ స్వామి ఉత్సవ మూర్తితో వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలరథములో లింగ రూప స్వామివారిని ఉంచి గ్రామంలో భజనలు చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ మంజునాథ స్వామి ఆలయం వద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి శివ మాలాధారులందరూ అత్యంత భక్తి ప్రవర్తనతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. అగ్నిగుండ ప్రవేశానికి చుట్టుప్రక్కల మండలాల నుండి వందల సంఖ్యలో శివ మాలాధారులు తరలివచ్చారు. వైభవంగా జరిగిన అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.