కనిగిరి: పట్టణంలో రూ.43 లక్షలతో ఆధునీకరించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలను ప్రారంభించిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.43 లక్షల వ్యయంతో ఆధునికరించిన ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహ భవనాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ తమిమ్ అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు. కాస్మోటిక్ నుంచి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఎన్డీఏ కొట్టుమి ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.