కనిగిరి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కనిగిరిలో రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతుల నిరసన
కనిగిరిలోని పొగాకు వేలంకేంద్రం వద్ద పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు మంగళవారం రోడ్డుపై పొగాకును తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.... పొగాకు రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు, ప్రభుత్వం తక్షణం స్పందించి పొగాకు రైతులకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పొగాకు రైతులు పాల్గొన్నారు.