సంతనూతలపాడు: చీమకుర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల ధర్నా
చీమకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను త్వరితగతిన ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులైట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.