కనిగిరి: కనిగిరి నియోజకవర్గం లో బిజెపిని బలోపేతం చేయాలి: మార్కాపురం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి కృష్ణారావు
కనిగిరి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అన్నారు. మార్కాపురం జిల్లా బిజెపి అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీవీ కృష్ణారావు మంగళవారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కృష్ణారావు సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి బిజెపిని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు.