యాడికి లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా ర్యాలీ చేశారు. జై చత్రపతి శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అన్నం శ్రీనివాసులు, రాజేష్ లు మాట్లాడారు. అందరూ చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు రాజు, గంగాధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.