కనిగిరి: కనిగిరి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా వెంకట నారాయణ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
కనిగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ముత్తుముల వెంకట నారాయణ రెడ్డి కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా జర్నలిస్ట్ ముత్తుమల వెంకటనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నికయ్యారు. కనిగిరి లో జరిగిన సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరూ ఏకాభిప్రాయంతో నూతన అధ్యక్షునిగా ముత్తుముల వెంకటనారాయణ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సభ్యులందరికీ కలసి ముందుండి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.