ఉరవకొండ: సమ్మె చేస్తున్న సత్య సాయి వాటర్ వర్క్స్ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు సిపిఎం నాయకులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ సత్య సాయి వాటర్ వర్క్స్ చేస్తున్నటువంటి కార్మికులకు ఐదు ఆరు నెలలుగా చేసిన వేతనాలు రాలేదని గత తొమ్మిది రోజులుగా నిరవదికంగా సమ్మె చేస్తున్న కార్మికులకు బుధవారం సిఐటియు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వము దృష్టికి సమస్యను తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈకార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ విరుపాక్షి, సుధాకర్ చాబాల, సత్యసాయి కార్మికులు చిన్న బాబయ్య జయన్న పెద్ద చెన్నయ్య గోవిందు లాలు స్వామి సంతోష్ వెంకటాచలం రఘు తరులు పాల్గొన్నారు