సంతనూతలపాడు: మద్దిపాడు మండలం మల్లవరం లో ఈనెల 26 నుండి మే 6వ తేదీ వరకు శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు: ఆలయ ఈవో లీలా కృష్ణ
మద్దిపాడు మండలంలోని మల్లవరంలో ఈనెల 26వ తేదీ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి లీలా కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మే నెల 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయన్నారు. మే 3వ తేదీన స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని, కళ్యాణానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈవో కోరారు.