కనిగిరి: పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు
కనిగిరి పట్టణంలోని 1వ మరియు 2వ వార్డులలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ "క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వార్డులలో ఉన్న చెత్త కుప్పలను గుర్తించి, ఖాళీ ప్రదేశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అలాగే నాళాలు, మేజర్ కాలువలను శుభ్రపరచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పట్టణాన్ని పారిశుధ్యపరంగా క్లీన్ గా ఉంచడంతోపాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు.