రాప్తాడు: రాష్ట్రంలో విధ్వంసం పాలన నుంచి అభివృద్ధి సంక్షేమ వికాసం వైపు నడుస్తుంది కక్కలపల్లిలో అనంతపురం ఇన్చార్జి మంత్రి టీజీ భరత్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి భరత్ కుటుంబ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి భారత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధ్వంసం పాలన కొనసాగిందని నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం వికాసం వైపు ముందుకు వెళుతుందని రానున్న మూడు సంవత్సరాల్లో కూడా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని టిడిపి విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి భరత్ పేర్కొన్నారు.