ఉరవకొండ: చౌక ధాన్యపు దుకాణాల్లో నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుంటే చర్యలు తప్పవు: బెలుగుప్ప తహసీల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాల్లో నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుంటే డీలర్లపై చర్యలు తప్పవని మండల తహసీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయము నందు ప్రభుత్వ చౌక ధర దుకాణదారుల తో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలని, గ్రామాల్లో దుకాణాలను ప్రతి నెల 1 తేదీ నుండి 15 తేదీ వరకు తెరచి ఉంచాలని, తూకాలను సక్రమంగా అందించాలని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురు బ్రహ్మ, డీలర్లు పాల్గొన్నారు.