కనిగిరి: పామూరు మండలం నుచ్చు పొదలో శానిటేషన్ పై ఇంటింటి సర్వేను చేపట్టిన ఎంపీడీవో బ్రహ్మయ్య
పామూరు మండలంలోని నుచ్చు పొద గ్రామంలో ఎంపీడీవో బ్రహ్మయ్య శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సానిటేషన్ ను ఆయన పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి శానిటేషన్ పై పంచాయతీ సిబ్బంది సరిగా పనిచేస్తున్నారా, లేదా అనే వివరాలను ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా శానిటేషన్ పై ప్రజల అభిప్రాయం కోరుతుందని, శానిటేషన్ పై సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారో లేదో ప్రభుత్వానికి తెలపవచ్చని ఎంపీడీవో సూచించారు. అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.