సంతనూతలపాడు: మంగమూరు హత్య కేసులో ముద్దాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా పోలీసుల ఎదుట దానికి యత్నించిన మృతుడి బంధువులు
సంతనూతలపాడు మండలం మంగమూరులో అశోక్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తిని పోలీసులు ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వైద్య పరీక్షల కోసం తరలిస్తున్న నేపథ్యంలో మృతుల బంధువులు మంగళవారం దాడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.