కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసిబి యంత్రాలతో మంచినీటి దొరువు లో అధికారులు పూడికతీత పనులు చేపట్టగా ఆ పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ఆధునీకీకరణ పనులను అధికారులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.