కళ్యాణదుర్గం: కదిరిదేవరపల్లి లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మేనల్లుడు, టీడీపీ సీనియర్ నాయకులు ధర్మతేజ
కంబదూరు మండలం కదిరి దేవరపల్లి లో ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో కళ్యాణమండపం, వంటగది, ఆరో ప్లాంట్, భోజనశాల, సీ సీ రోడ్లు నిర్మించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు, టీడీపీ సీనియర్ నాయకులు ధర్మతేజ పలువురు కార్యకర్తలతో కలిసి గురువారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ధర్మ తేజ చెప్పారు.