రాప్తాడు: రామునేపల్లి క్రాస్ వద్ద కనిగానపల్లికి చెందిన కురుబ రంజిత్ కుమార్ ఐచర్ వాహనం ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మార్గంలో మృతి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని రామనేపల్లి గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై శుక్రవారం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో కనగానపల్లి మండలానికి చెందిన కురుబ రంజిత్ కుమార్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది స్థానిక గ్రామస్తులు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన రంజిత్ కుమార్ వ్యవసాయ మందులు కొనుగోలు చేసేందుకు అనంతపురం వచ్చి మిత్రుడు ప్రసాద్ కలిసి వెళుతున్న సందర్భంలో ఐచర్ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదం పైన రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.