కనిగిరి: పట్టణంలో ఏప్రిల్ 8న జరుగు ఏఐటియుసి జిల్లా మహాసభను జయప్రదం చేయాలి: ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్
కనిగిరి పట్టణంలో ఏప్రిల్ 8వ తేదీన జరుగు ఏఐటియుసి మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు.. కనిగిరిలోని ఏఐటియుసి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటియుసి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైట్ చేయాలని యాసిన్ డిమాండ్ చేశారు కార్మికుల చట్టాల స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఏఐటియుసి మహాసభకు కార్మికులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.