ఉండవల్లి నివాసంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్ ఇచ్చిన విందుకు జే సీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని ఉత్సాహంగా కనిపించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి కాసేపు చర్చించుకున్నారు.