కనిగిరి: డీలర్లతో కూటమి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ఆయిల్ కృత్రిమ కొరత: కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: గత రెండు, మూడు రోజులుగా ఏపీలో ఆయిల్ కొరత విపరీతంగా ఉందని, డీలర్లతో కూటమి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగానే కృత్రిమ కొరత ఏర్పడిందని, కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ ఆరోపించారు. కనిగిరిలో పెట్రోల్ బంకులను వైసిపి నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని కేవలం ఏపీలోనే ఈ సమస్య ఉందన్నారు. ప్రభుత్వ లాలూచీ విధానాల వల్ల వినియోగదారులు , రైతులు ఆయిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని నారాయణ యాదవ్ ఆరోపించారు.