ఉరవకొండ: విడపనకల్లులో దోమల నివారణ పై అవగాహన ర్యాలీ
అనంతపురం జిల్లా విడపనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రజలకు మలేరియా వ్యతిరేక మాస ఉత్సవంలో భాగంగా ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు దోమ తెరలు వాడండి దోమ కాటు నుంచి రక్షణ పొందండి చిన్న దోమ పెద్ద ప్రమాదం మురికి నీటి కుంటలు దోమలకు ఆవాస కేంద్రాలు వేపాకు పొగ దోమలకు సెగ అనే నినాదంతో ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కోదండరామిరెడ్డి పేర్కొన్నారు.