రాప్తాడు: ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రజాదర్బాలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం 11:30 గంటల సమయంలో ఎంపీడీవో కార్యాలయం నందు ప్రజా దర్బారు కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆత్మకూరులో ప్రజాదర్బాలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగిందని వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని అదే విధంగా ప్రజలు ఇచ్చే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారులకు కృషి చేయాలని ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.