తాడిపత్రి: చందన గ్రామంలోని ఆంజనేయస్వామి, రామస్వామి దేవాలయాలను సందర్శించి, పూజలు చేసిన రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ మృత్యుంజయరావు
యాడికి మండలం చందన గ్రామంలోని దేవాలయాలను ఆదివారం రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ మృత్యుంజయరావు సందర్శించారు. చందనలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, చందన కొండ పై రామస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మృతంజయరావుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మృత్యుంజయరావుకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.