ఉరవకొండ: ఇప్పేరులో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీ ట్రాక్టర్ ప్రమాదంలో మృతి
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో ఆదివారం వ్యవసాయ కూలీ అయిన శివలింగమ్మ ఓ రైతు పొలంలో వ్యవసాయ పనికి వెళ్ళింది. భోజనం సమయంలో ట్రాక్టర్ ట్రాలీ కింద కూలీలు కూర్చొని అన్నం తింటున్న సమయంలో ఓ చిన్నారి ట్రాక్టర్ పైకి ఎక్కి తాళాలు తిప్పడంతో ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి ముందుకు కదలడంతో ట్రాక్టర్ టైరు తగిలి శివలింగమ్మ గాయపడింది. అనంతపురంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది.