కనిగిరి: చంద్రశేఖరపురం మండలంలోని కోవిలంపాడు స్వర్ణ గ్రామ సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎంపీడీవో ప్రతాప్ రెడ్డి
చంద్రశేఖరపురం మండలంలోని కోవిలంపాడు స్వర్ణ గ్రామ సిబ్బందితో చంద్రశేఖరపురం ఎంపీడీవో ప్రతాప్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టే ప్రభుత్వ సర్వే కార్యక్రమాలను నూరు శాతం పూర్తి చేయాలని స్వర్ణ గ్రామ సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. గ్రామ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం పనిచేయాలని, సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందించేందుకు కృషి చేయాలని స్వర్ణ గ్రామ సిబ్బందిని ఎంపీడీవో ఆదేశించారు.