సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో చెట్ల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో విద్యార్థులు చెట్ల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ గురువారం వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు 'చెట్లను రక్షిద్దాం... ప్రకృతిని కాపాడుకుందాం' అనే అంశంపై నాటకం రూపంలో ప్రదర్శన నిర్వహించగా, ఉప్పుగుండూరు ప్రజలను విద్యార్థుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడం వల్ల కలిగే అనర్ధాలు, ప్రకృతిని నాశనం చేస్తే ఏర్పడే దుష్ఫలితాలను విద్యార్థులు ఈ ప్రదర్శన ద్వారా చక్కగా వివరించారు.