వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు మంగళవారం రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడారు. ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.