కనిగిరి: మండలంలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం
కనిగిరి మండలంలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఆయా గ్రామ పంచాయతీల సిబ్బంది కృషి చేయాలని కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం సూచించారు. కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం కనిగిరి మండలంలోని గ్రామపంచాయతీలకు పుష్ కార్డ్స్ ను మరియు డస్ట్ బిన్లను ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని, ప్రజల నుండి పారిశుధ్యం పై ఫిర్యాదులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత పంచాయతీల సిబ్బందిపై ఉందన్నారు.