కనిగిరి: భూముల రిసర్వే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్యదర్శి ప్రభాకర్ చౌదరి
పామూరు: భూముల రి సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంద దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర టిడిపి మీ భిన్న ప్రతిభావంతుల కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి అన్నారు. బుధవారం పామూరు మండలంలోని బోట్ల గూడూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బొట్ల గూడూరు 1, బోట్ల గూడూరు 2 పరిధిలో రెవిన్యూ అధికారులు చేపడుతున్న భూముల రి సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారదర్శకంగా రెవిన్యూ అధికారులు భూముల రి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.