సంతనూతలపాడు: కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు: చీమకుర్తిలో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి
చీమకుర్తి పట్టణంలోని గాంధీ నగర్ లో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేసి , పాఠశాలలో విద్యాబోధన ,మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు ఆమె వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్ది, అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఏం సి చైర్మన్ సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.