కనిగిరి: టిడిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: టిడిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంట్ టిడిపి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థ గత నిర్మాణం, బలోపేతంపై ఆయన నాయకులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.