రాయదుర్గం: పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఎంపి, మాజీ ఎంపీ, జెడ్పీ చైర్ పర్సన్, పలువురు ప్రముఖులు
రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం జరిగిన వాల్మీకి సంఘం అధ్యక్షులు బండికిష్టప్ప కుమారుడి వివాహ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు. అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రిటైర్డ్ జడ్జి, అలాగే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వారిని కలిసి ఫోటోలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.