ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మార్వో రమణారావు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే కోసిన వరి మొలకెత్తకుండా క్వింటా ధాన్యానికి కేజీ ఉప్పు 20 కేజీల ఊక కలపాలని పేర్కొన్నారు. పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.