కనిగిరి: పట్టణంలో మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను సోమవారం ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను స్వయంగా పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచినీటి దొరువు సుందరీ కరణ కార్యక్రమంలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తామని, లైటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.