రాయదుర్గం: @మోకా ఆంజనేయులు ఆత్మహత్య ఘటనలో నిందితుల అరెస్టుకు కుటుంబ సభ్యుల డిమాండ్
కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మోకా ఆంజనేయులు మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డితో కలిసి సోమవారం రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ నాయకుల దాడి, అవమాన భారంతో ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మారుతి ప్రసాద్, లావణ్యల వల్ల తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే వారిని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.