బచ్చన్నపేట: భువనగిరి: సర్వేలు గురుకుల పాఠశాలలో డైట్ కాస్మోటిక్ చార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ గురుకుల పాఠశాల సర్వేలు లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ కు బ్యాండ్ మేళతో ఘన స్వాగతం పలికారు.