కనిగిరి: పట్టణంలో శ్రీ అభయాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలోని కొత్తూరులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి తిరునాళ్ల కార్యక్రమం ఈనెల 12న జరగనుంది. ఈ సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ వైసీపీ నాయకులతో కలిసి వైసిపి తరఫున ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. కార్యక్రమానికి తరలివచ్చే భక్తులకు మరియు వైసీపీ శ్రేణులకు ఇబ్బందులు తలెత్తకుండా వైసిపి నాయకులు ఏర్పాట్లు చేయాలని నారాయణ యాదవ్ సూచించారు.