కనిగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. వాతావరణ కాలుష్యం తగ్గించాలన్న, సకాలంలో వర్షాలు కురవాలన్నా పచ్చదనాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు.