కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
కనిగిరి పట్టణం ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు శనివారం జరిగిన అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కనిగిరి నడిబొడ్డులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇందుకోసం కృషిచేసిన అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను, మరియు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని హోంమంత్రి అనిత ప్రత్యేకంగా అభినందించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి తెలిపారు.